Saturday, May 4, 2024

నగరంలో ఘరానా దొంగ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

thief arrested by charminar police at hyderabad

హైదరాబాద్: నగరంలో ఓ ఘరానా దొంగ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నసీర్ అనే ఘరానా దొంగను చార్మినార్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నసీర్ దగ్గరి నుంచి రూ.31లక్షల నగదు, ల్యాప్ టాప్, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 4న చార్మినార్ రికాబ్ గంజ్ లోని దుకాణంలో రూ.35లక్షలు చోరీ చేశాడు. సిసి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనూ నసీర్ పై చాంద్రాయణగుట్ట, అఫ్జల్ గంజ్ పోలీసు స్టేషన్లలో పలు కేసులున్నాయి. మూడవ తరగతి వరకు చదుకున్న నసీర్ చార్మినార్ లోని ఒక వస్త్ర దుకాణానికి సేల్స్ మాన్ గా పని చేస్తున్నాడు. ఆదాయం సరిపోకపోవడంతో దోపిడీకి దిగాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చార్మినార్ పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News