- Advertisement -
హైదరాబాద్: రెసిడెన్షియల్ వ్యవస్థను బలోపేతం చేశామని సాంఘిక సంక్షేమం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్తరాలు సందర్భంగా కొప్పుల మీడియాతో మాట్లాడారు. రెసిడెన్షియల్ స్కూళ్లపై సిఎం కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కొనియాడారు. రెసిడెన్షియల్ స్కూళ్లతో మంచి ఫలితాలు వస్తున్నాయని, కొత్తగా 603 రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించామని, నాలుగు లక్షల మందికిపై విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతున్నారని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన రెసిడెన్షియల్ స్కూళ్లలో అడ్మిషన్స్ జరుగుతున్నాయని కొప్పుల వివరించారు.
- Advertisement -