- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలకు గల్లంతైన నవీన్కుమార్ మృతదేహం వెతుకులాటను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షించారు. సోమవారం సరూర్నగర్ ట్యాంక్ బండ్లో వెతికడం ప్రారంభించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భారీ వర్షానికి కొట్టుకువచ్చిన నవీన్కుమార్ మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కమిషనర్ మహేష్భగవత్ అభినందించారు. మరోవైపు మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు నగరంలో నాళాలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఓ 12ఏళ్ల ఓ అమ్మాయి నాళాల్లో పడి మృతిచెందిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం జరగడంతో నగరవాసుల్లో ఆందోళనకు గురవుతున్నారు.
NDRF Team found Man dead body at Saroornagar
- Advertisement -