- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. గత 24 గంటల్లో 2166 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 10 మంది చనిపోయారు. తెలంగాణ ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1.74 లక్షలకు చేరుకోగా 1052 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 1.44 లక్షల మంది కోలుకోగా 29 వేల మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా టెస్టులు 25.73 లక్షలు చేయగా సోమవారం ఒక్క రోజే 53 వేల టెస్టులు చేశారు. హైదరాబాద్ జిహెచ్ఎంసి (309) పరిధిలోనే అత్యధిక కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- Advertisement -