- Advertisement -
హైదరాబాద్: నగర రాజేంద్రనగర్ పొలీస్టేషన్ పరిధిలోని వాలంతరీ వద్ద మరోసారి చిరుత పంజా విసిరింది. అర్ధరాత్రి రెండు ఆవులపై దాడి చేసి మెడలను పూర్తిగా తినేసింది. గత నెలరోజుల క్రితం చిరుత అదే స్థలంలో ఒక ఆవుపై దాడి చేసింది. ఈ వరస ఘటనలతో స్థానిక ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. చిరుత పంజా హద్దులను పసిగట్టిన స్థానికులు మళ్లీ చిరుత సంచరిస్తుందని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు చిరుత సంచరించిన తీరు, అవులపై దాడిని పరిశీలిస్తున్నారు. ఎవరూ భయపడొద్దని పోలీసులు ప్రజలకు ధైర్యం చెప్పారు.
Leopard Attacking Cows in Hyderabad
- Advertisement -