Friday, April 26, 2024

బిబినగర్ ఎయిమ్స్ ను సందర్శించిన కిషన్ రెడ్డి (వీడియో)

- Advertisement -
- Advertisement -

Union Minister Kishan Reddy Inspected AIIMS BIBINAGAR

భువనగిరి: బిబినగర్ ఎయిమ్స్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శనివారం సందర్శించారు. ఇప్పటివరకు పూర్తయిన నిర్మాణ పనులను కిషన్ రెడ్డి పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. బిబినగర్ ఎయిమ్స్ పురోగతిపై అధికారులతో కేంద్రమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ వెబ్ సైట్ ను కిషన్ రెడ్డి ప్రారంభించి, ఆయన మాట్లాడుతూ… ఎయిమ్స్ లో లోటుపాట్లను తెలుసుకునేందుకే సందర్శించానని చెప్పారు. అందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

మోడీ సర్కారు వచ్చాక దేశవ్యాప్తంగా 9 ఎయిమ్స్ లను ఏర్పాటు చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ కు స్థలం కేటాయించడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి తెలిపారు. ఎయిమ్స్ నిర్మాణం, ఉద్యోగ, మౌలిక సదుపాయాల కల్పన ప్రారంభమైందన్న ఆయన భవిష్యత్తులో ఎయిమ్స్ మరింత తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. వైద్య కళాశాల పూర్తయితే 750 మంది విద్యనభ్యసిస్తారు. నెల రోజుల్లో ఒపి బ్లాకును పు:న ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. ఎయిమ్స్ లో ఆయుష్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎయిమ్స్ ప్రాంగణంలో బ్యాంకు, పోస్టాఫీస్ ఏర్పాటు చేస్తామని సూచించారు. అధికారికంగా భవనాన్ని ఎయిమ్స్ కు బదలాయించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు.

Union Minister Kishan Reddy Inspected AIIMS BIBINAGAR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News