- Advertisement -
హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నగరంలో దెబ్బతిన్న రోడ్లమరమ్మతుల పనులను చేపట్టినట్లు జిహెచ్ఎంసి చీఫ్ ఇంజనీర్ జియాఉద్దిన్ తెలిపారు. తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో జారీ చేసిన ఆదేశాలను అనుగుణంగా యుద్దప్రాతిపదికన రోడ్లు మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నగరంలో సాధారణ స్థితిని పునరుద్దరించేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు జియాఉద్దిన్ పేర్కొన్నారు.
GHMC undertaking road repairs in Hyderabad
- Advertisement -