- Advertisement -
దుబాయ్: ఐపిఎల్-2020 లో శనివారం రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఢీకొనుంది. తదుపరి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఇక, దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఢిల్లీ జట్టు మొదట్లోనే ఓపెనర్ శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయాడు. ధావన్ డకౌట్ కాగా, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో బ్యాక్ వర్డ్ పాయింట్ లో సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చాడు. కాసేపటికే పృథ్వీ షా కూడా పెవిలియన్ కు చేరాడు. 15 పరుగుల వద్ద పృథ్వీ షా(10)పరుగులు చేసి బౌల్ట్ కు వికెట్ అప్పగించేశాడు. దీంతో 8.1 ఓవర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. ప్రస్తుతం రిషబ్ పంత్(8), శ్రేయాస్ అయ్యర్ (23) పరుగుల వద్ద ఆడుతున్నారు.
- Advertisement -