- Advertisement -
భువనేశ్వర్: సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన ఒడిశాలోని పర్లాకిమిడి రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. సూర్యకుమార్ అనే యువకుడు ఆగి ఉన్న పాసింజర్ రైలు పైకి ఎక్కి సెల్ఫీ తీసుకుంటుండగా హైటెన్షన్ వైర్లు తగిలి కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో రెండు బోగీలు కూడా మంటలకు దగ్ధం అయ్యాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, మంటలను అదుపు చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసిన జిఆర్పి పోలీసులు.. మృతదేహాన్ని కిందికి దించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Young man dies when taking selfie atop train in Odisha
- Advertisement -