- Advertisement -
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ పృథ్వీ షా(0) రెండో బంతికే స్టార్క్ బైౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(17) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో 32 పరుగులకే టీమిండియా ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కొంత ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, పుజారాలు ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో విరామ సమయానికి భారత్ 25 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(5), పుజారా(17)లు ఉన్నారు.
IND lost opener wickets against AUS in 1st Test
- Advertisement -