Thursday, May 16, 2024

రెండు బైక్‌లు ఢీ: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లా కోరాడపేట సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వంగర గ్రామానికి చెందిన సతీష్, రవి కుమార్ అనే వ్యక్తులు రెడ్డిపల్లిలో జరిగే పెళ్లికి బైక్‌పై బయలుదేరారు. కోరుకొండ గ్రామానికి చెంది ప్రజ్వల్, రవికుమార్ ద్విచక్రవాహనంపై కోరాడపేటకు వెళ్తున్నారు. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో సతీష్, ప్రజ్వల్ ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News