Sunday, May 5, 2024

ఇంట్లో సిలిండర్‌కు దండం పెట్టి.. వచ్చి ఓటు వేశా

- Advertisement -
- Advertisement -
Minister KTR Satires on Modi Government
పరోక్షంగా మోడీ ప్రభుత్వంపై సెటైర్లు విసిరిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్: గతంలో ఒక మహానుభావుడు చెప్పినట్లుగా ఇంట్లో సిలిండెర్‌కు దండం పెట్టి వచ్చి ఓటు వేశానని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ పరోక్షంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై సైటర్లు విసిరారు. ఎంఎల్‌సి ఎన్నికల్లో భాగంగా భాగంగా ఆదివారం తన ఓటును బంజారాహిల్స్‌లోని షేక్‌పేట్ తహసిల్దార్ కార్యాలయంలో కెటిఆర్ వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యావంతులు, యువకుల సమస్యలను అర్థం చేసుకొని తీర్చగలిగే సామర్థ్యము, అవకాశం ఉన్న అభ్యర్థికే ఓటు వేశానన్నారు.

అందరికి ధన్యవాదాలు…

రాష్ట్రంలో జరిగిన రెండు గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి స్థానాలకు సంబంధించిన ఎన్నికల్లో టిఆర్ విజయం కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఇన్‌ఛార్జీలుగా వ్యవహరించిన మంత్రులు, శాసనసభ్యులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గత రెండు వారాలుగా పార్టీ యంత్రాంగం మొత్తం ఈ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిందని, ఈ ఎన్నికల్లో పార్టీ చేసిన ప్రయత్నానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని పోలింగ్ ముగిసిన అనంతరం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. విద్యావంతులంతా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యలో కీలకమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని తాము చేసిన విజ్ఞప్తికి స్పందించిన ప్రతి ఒక్క విద్యావంతునికి ఆయన అభినందనలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News