Tuesday, April 30, 2024

మల్యాల ఎస్సీకాలనీలో కరోనా కలకలం

- Advertisement -
- Advertisement -

70 were tested and 40 has Covid positive in Malyala Village

మల్యాల: జగిత్యాల జిల్లాలోని మల్యాల ఎస్సీ కాలనీలో కరోనా కలకలం రేగింది. 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో 40 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కాలనీవాసులు ఇటీవల జరిగిన ఎల్లమ్మ బోనాల్లో పాల్గొన్నారు. దీంతో కరోనా వేగంగా విస్తరించింది. సమాచారం అందుకుని అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు ఎస్సీ కాలనీలో కోవిడ్-19 పరీక్షలు కొనసాగిస్తున్నారు. అటు రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,055 మందికి కరోనా మహమ్మారి సోకింది.

70 were tested and 40 has Covid positive in Malyala Village

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News