- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 74,681 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 14,669 మందికి వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ లో వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 71మంది మృతిచెందారని తెలిపింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,69,544కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 9.60 లక్షలకు పైగా బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రలో 7,871 మంది బాధితులు కరోనాతో మరణించారు. ఎపిలో ఇప్పటివరకు 1,62,17,831 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
14669 New Corona Cases Reported in AP
- Advertisement -