- Advertisement -
అమరావతి: బైక్ ను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరిపాడి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తాళ్లూరు చెందిన షేక్ చిన్న మస్తాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి బైక్ వెళ్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు చిన్న మస్తాన్, నూర్జహాన్, హుస్సేన్ గా గుర్తించారు.
- Advertisement -