హైదరాబాద్ : సిఎం కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. కరోనా పరిస్థితులే ప్రధాన అజెండాగా మంత్రివర్గం భేటీ అవుతోంది. లాక్ డౌన్ కొనసాగింపు, కరోనా మూడోవేవ్ సన్నద్ధత, ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పిఆర్సీ, ప్రభుత్వ డయాగ్నొస్టిక్ కేంద్రాల ప్రారంభంపై చర్చించే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతన సవరణ ఫైల్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే, వానకాలం పంటలు, సాగునీటి పారుదల అంశాలపై చర్చించి తగిన నిర్ణయాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి మంత్రివర్గం తగిన నిర్ణయాలు తీసుకోనున్నది. అయితే రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగిస్తారా..? ఎత్తివేస్తారా..? అన్నదాని కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాలి మరీ.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం
- Advertisement -
- Advertisement -
- Advertisement -