- Advertisement -
హైదరాబాద్: గ్రామాల రూపు రేఖలు మార్చాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రేపటి నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపడుతామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాలకతీతంగా కలెక్టర్లకు అధికారాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పొగిడారు. గ్రామ పంచాయతీలకు రూ.6500 కోట్లు కేటాయించామని, తెలంగాణలో 15 కోట్ల ఉపాధిహామీ పనుల దినాలు కల్పించామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి నోడల్ అధికారిని నియమించామని, గ్రామాల ప్రగతిపై తెలంగాణ ఎన్నో అవార్డులు గెలుచుకుందన్నారు.
- Advertisement -