Tuesday, April 30, 2024

హైదరాబాద్‌లో వాహనాల వేలం

- Advertisement -
- Advertisement -

Hyderabad Police auctioning vehicles

హైదరాబాద్: సీజ్‌డ్, స్వాధీనం చేసుకున్న వాహనాలకు హైదరాబాద్ పోలీసులు వేలం నిర్వహించారు. గోషామహల్‌లోని శికుమార్‌లాల్ పోలీస్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన వేలంలో 2,548 వాహనాలను విక్రయించేందుకు ప్రదర్శించారు. నగర అదనపు పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేలంలో పలువురు పాల్గొన్నారు. వేలంలో పాల్గొన్న వారికి పలు విషయాలు చెప్పారు. వాహనాలకు వేలం నిర్వహించడం ఇది 12వ సారి. వేలంలో పాల్గొనేందుకు చాలామంది వచ్చారు. ఇందులో 2,404 బైక్‌లు, 59 త్రీ వీలర్లు, 12 ఫోర్ వీలర్లు ఉన్నాయి. వాటిని రూ.54,53,500కు విక్రయ ధర నిర్ణయించగా, వేలంలో పాల్గొన్న వారు రూ.1,44,26,500కు సొంతం చేసుకున్నారు. వేలం విజయవంతంగా నిర్వహించిన సిబ్బందిని అభినందించారు.

Hyderabad Police auctioning vehicles

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News