- Advertisement -
హైదరాబాద్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, హోండా యాక్టివా బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. ధూల్పేట, మంగళ్హాట్కు చెందిన వివేక్ సింగ్(20) స్థానికంగా కేబుల్ నెట్ వర్క్లో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివాసముంటున్న బైక్ మెకానిక్ రాహుల్ సింగ్(21) స్నేహితులు. ఇద్దరు జల్సాలకు అలవాటుపడ్డారు. డబ్బులు లేకపోవడంతో మంగళ్హాట్కు చెందిన శుభమ్ సింగ్ నుంచి గంజాయి కొనుగోలు చేసి బంజారాహిల్స్ ప్రాంతంలో విక్రయిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు రోడ్డు నంబర్ 1లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
- Advertisement -