- Advertisement -
హైదరాబాద్: తాను ఎక్కడికి పారిపోలేదని శిల్పచౌదరీ తెలిపారు. రెండో రోజు శిల్ప చౌదరీనిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా పలు విషయాలను పోలీసులకు వివరించారు. ఆరుగురు దగ్గర నుంచి తాను రుణాలు తీసుకున్నానని, చాలా మంది తనకు బ్లాక్ మనీని వైట్ మనీగా చేయమని ఇచ్చారని, చాలా వరకు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టానని, రియల్ ఎస్టేట్లో పెట్టిన డబ్బులు ఇంకా తిరిగి రాలేదని పేర్కొన్నారు. చాలా మంది ప్రముఖులు తనకు డబ్బులు ఇచ్చారని, తనకు ఎవరినీ మోసం చేయాలనే ఆలోచన లేదని, అందరికీ డబ్బులు తాను త్వరలో తిరిగి ఇస్తామన్నారు. సినిమా హాళ్లు, ఆస్పత్రులు, కొన్ని నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెట్టానని పోలీసులకు వివరించారు. తన దగ్గర డబ్బులు తీసుకొని వాళ్లు తిరిగి ఇవ్వకపోవడంతో తాను తీసుకున్న వారికి తిరిగి చెల్లించలేకపోయానని వివరణ ఇచ్చారు.
- Advertisement -