Saturday, May 4, 2024

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Two arrested in drunk and drive in hyderabad
వివరాలు చెప్పిన నగర సిపి అంజనీకుమార్

హైదరాబాద్: మద్యం తాగి కారు నడిపి ఇద్దరి ప్రాణాలు తీసిన నిందితులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉప్పల్‌కు చెందిన రోహిత్ రెడ్డి, సాయిసుమన్ రెడ్డి కలిసి దుర్గం చెరువులోని బార్ అండ్ రెస్టారెంట్‌లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. అక్కడ ఆదివారం సాయంత్రం 5.15 గంటల నుంచి రాత్రి 9.30 గంటలకు వరకు ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి వచ్చి ప్యాట్ పీజియన్‌లో రాత్రి 11.45 గంటల వరకు మద్యం తాగారు. అక్కడి నుంచి రాడిసన్ హోటల్‌కు 12.30 గంటలకువ వెళ్లిన ఇద్దరు నిందితులు సోమవారం తెల్లవారుజాము 1.19 గంటలకు బయటికి వచ్చారు. అక్కడి నుంచి కారు అతివేగంగా రావడంతో రెయిన్‌బో ఆస్పత్రి వద్ద ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టారు. అక్కడి నుంచి తప్పించుకుని పోయి ఎల్లారెడ్డి గూడలోని స్నేహితుల ఇంటిలో కారు పార్కింగ్ చేసి వేరే కారులో బయటికి వచ్చారు. ఇద్దరు యువకులను గుర్తించిన కానిస్టేబుళ్లు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News