Saturday, May 18, 2024

ఐటీ రంగంలో నగరం నెంబర్ వన్

- Advertisement -
- Advertisement -

MLC Kavitha Unveiled an IT company

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఐటీ రంగంలో యువతను మంత్రి కెటిఆర్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని ఎంఎల్ సి కవిత అన్నారు. శనివారం ఉప్పల్ అబాకస్ ఐటి పార్క్‌లో సాలిగ్రామ్, టెక్ స్మార్ట్ ఐటి కంపెనీ నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఐటీ రంగాన్ని హైదరాబాద్‌లో అన్ని వైపులా విస్తరించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. అందులో భాగంగా ఉప్పల్ కారిడార్‌లో అనేక ఐటీ పరిశ్రమలు నెలకొల్పుతుండటంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఐటీ పరిశ్రమలు నెలకొల్పే దిశగా మంత్రి కెటిఆర్ యువతను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. నగరం ఐటీ రంగంలో దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. కంపెనీ స్థాపించి అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న సాలిగ్రామ్, టెక్ స్మార్ట్ ఐటి కంపెనీ యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. ఈ రోజు ప్రారంభించిన కంపెనీలో దాదాపు 300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News