Wednesday, May 15, 2024

కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే పిటి థామస్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Kerala congress MLA PT Thomas passed away

కోచ్చి: కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, శాసనసభ్యుడు పిటి థామస్ బుధవారం తమిళనాడులోని ఒక ఆసుపత్రిలో కన్నుమూశారు. వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో క్లోమ గ్రంథికి సంబంధించిన సమస్యలకు చికిత్స పొందుతున్న 71 సంవత్సరాల థామస్ బుధవారం ఉదయం కన్నుమూసినట్లు పార్టీ వర్గాలు ఇక్కడ తెలిపాయి. 2009-2014లో ఇదుక్కి నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించిన థామస్ వరుసగా రెండవసారి ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో త్రిక్కాకర అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా ఆయన ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News