Friday, September 26, 2025

బాలికను తుపాకీతో కాల్చి… ప్రేమోన్మాది ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: మైనర్ బాలికను ప్రియుడు తీసుకొని పారిపోవడంతో పోలీసులు వారు ఉంటున్న గదిని చుట్టుముట్టడంతో బాలికను తుపాకీతో కాల్చి అనంతరం అతడు కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజప్పర్‌నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రిన్స్ అనే యువకుడు ఓ బాలికను ప్రేమించాడు. ఈ నెల 19న బాలికతో యువకుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ప్రిన్స్‌పై ఫిర్యాదు చేశారు. బులంద్‌శహర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. పోలీసులు గదిని చుట్టుముట్టడంతో ప్రిన్స్ బాలికను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ప్రిన్స్ తనకు తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌పి దినేశ్‌కుమార్ అక్కడికి చేరుకొని నాటుతుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

Also Read: ఉపాధ్యాయులకు టెట్ ని‘బంధనలు’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News