హైదరాబాద్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై ఉమేష్ అనే క్రైమ్ కానిస్టేబుల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఎస్ ఎస్ జైన్ స్కూల్ సమీపంలో నివాసం వుండే పన్నెండు సంవత్సరాల బాలిక ఇంటిప్రక్కనే క్రైమ్ కానిస్టేబుల్ ఉమేష్ నివాసం ఉంటున్నాడు. అయితే, లాక్డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా బాలిక బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. దీన్ని గమనించిన కానిస్టేబుల్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యాచారం చేశాడు. సదరు బాలిక జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు చెప్పడంతో వారు బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో వెంటనే నగర అదనపు పోలీస్ కమిషనర్ షికాగోయల్ కి సమాచారం ఇవ్వగా బోయిన్ పల్లి పోలీస్ లు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో, అత్యాచారం కింద కేను నమోదు చేయాలనీ షికాగోయల్ ని బాలల హక్కుల సంఘం కోరింది. పోక్సో చట్టం ప్రకారం బాలికకు జిల్లా కలెక్టర్ నుండి వెంటనే ఆర్ధిక సహకారం అందించాలని, నిందితుడు భయభ్రాంతులకు గురిచేయడంతో భయ కంపితురాలైన బాధిత బాలికకు సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలని, నిందితుణ్ణి వెంటనే ఉద్యోగం నుండి బర్తరఫ్ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది.
A Girl raped by Crime Constable in Hyderabad