Saturday, April 27, 2024

బంజారాహిల్స్​ ఇన్​స్పెక్టర్​గా ఏడేళ్ల బాలుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: క్యాన్సర్ తో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడి కోరికను బంజారాహిల్స్ పోలీసులు నెరవేర్చారు. గుంటూరుకు చెందిన సాయి అనే బాలుడు ఏడాది క్రితం క్యాన్సర్ బారినపడ్డాడు. హైదరాబాద్ లోని  బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ చిన్నారికి పోలీస్ అవ్వాలని కోరిక ఉందని తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది మేక్ ఎ విష్ ఫౌండేషన్ సభ్యుల ద్వారా బంజారాహిల్స్ పోలీసులను సంప్రదించారు. అక్కడి సిబ్బంది బాలుడిని సాదరంగా ఆహ్వానించి పోలీసు అధికారిగా సీట్లో కూర్చొబెట్టారు. బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ చిన్నారికి పోలీసు గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో జరిగే పని విధానం గురించి తెలియజేశారు. దీంతో బాలుడు ఎంతో సంతోష పడ్డాడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News