- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ ఘన విజయం సాధించింది. దీంతో ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హాట్రిక్ కొట్టారు. బిజెపి, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలను దారుణంగా ఓడించి.. ఢిల్లీ పీఠాన్ని ఆప్ ముచ్చటగా మూడోసారి కైవసం చేసుకుంది. కేజ్రీవాల్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఢిల్లీ ప్రజలు జైకొట్టారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని ఆప్ సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 36 కాగా, ఆప్ 60 స్థానాలకు పైగా విజయం సాధించడంతో ఆప్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న తన భార్యకు కేజ్రీవాల్ ఎన్నికల్లో భారీ గెలుపుతో అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినట్లయింది.
AAM AADMI Party Big Win in Delhi Elections 2020
- Advertisement -