న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి సంచలన విజయం సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు అప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీపై నమ్మకముంచి మూడోసారి గెలిపించిన ప్రజలు సరికొత్త తీర్పునిచ్చారని.. ఐ లవ్ యూ ఢిల్లీ అని కేజ్రీవాల్ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇది ఢిల్లీ ప్రజల విజయమే కాదు.. యావత్ భారతావని విజయమని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజలకు కల్పించిన సౌకర్యాలు, అమలుచేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపించాయని..తక్కువ ధరకే విద్యుత్, నీటి సరఫరా, పౌరసేవలతోపాటు విద్య, వైద్యం కోసం మేము చేసిన కృషికి ప్రజలు మళ్లీ మమ్మల్ని ఆదరించి ఘన విజయాన్ని అందించారు. మరో ఐదేళ్లపాటు సేవ చేసేందుకు మమ్మల్నీ ఆశీర్వదించారు. ఈ ఐదేళ్లు మనమందరం కలిసి పనిచేద్దామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ నెల 8న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్ పార్టీ ఏకంగా 62 స్థానాల్లో గెలిచి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక, బిజెపి 8 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ మాత్రం ఖాతా కూడా తెరవకుండా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.
#WATCH: Aam Aadmi Party (AAP) chief Arvind Kejriwal addresses the party workers. #DelhiElectionResults https://t.co/CfeNtzk8LZ
— ANI (@ANI) February 11, 2020
Arvind Kejriwal Addresses After Victory in Delhi Polls 2020