Sunday, April 28, 2024

ఆ సత్తా కాంగ్రెస్ కు లేదు.. ఇండియా కూటమికి పంజాబ్ సీఎం షాక్

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల్లో కూటమితో కలిసి పనిచేసేందుకు పలు పార్టీలు వెనకడుగేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు గెలిచే సత్తా లేదని.. 13 స్థానాల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని సీఎం సీఎం భగవంత్ సింగ్ మాన్ స్పష్టం చేశారు.

తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇండియా కూటమికి షాకిచ్చారు.  వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి ఒంటరిగా పోటీ చేస్తామని వెల్లడించారు. ఇండియా కూటమితో పొత్తు ఉండదన్నారు. సీట్ల పంపకాల విషయమై కాంగ్రెస్ తో జరిపిన చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. బెంగాల్ లో ఒంటరిగానే పోటీ చేసి, బిజెపిని మట్టి కరిపిస్తామన్నారు.

పశ్చిమ బెంగాల్ లో మొత్తం 42 లోక్ సభ సీట్లు ఉండగా, కాంగ్రెస్ కు తృణమూల్ రెండు సీట్లు ఆఫర్ చేసింది. అయితే పదినుంచి పన్నెండు సీట్లకోసం కాంగ్రెస్ పట్టుబట్టింది. చర్చలు ముందుకు సాగకపోవడంతో ఒంటరిగానే పోటీ చేయాలని తృణమూల్ నిర్ణయించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News