- Advertisement -
భోపాల్: సోదరుడిని బావిలో తోసేసి అనంతరం యువతిపై ఏడుగురు అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్లోని బెతుల్ జిల్లాలో జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేయగా ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అన్నయ్య (21) తన చెల్లితో (18) కలిసి పాధర్ ప్రాంతం నుంచి తన సొంతూరుకు వెళ్తుండగా మధ్యలో ఏడుగురు వారిని అడ్డుకున్నారు. అనంతరం సొదరుడిని తీవ్రంగా కొట్టి బావిలో తోసేశారు. యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఏడుగురు అత్యాచారం చేశారు. కన్న కూతురు, కుమారుడు ఇంటికి రాకపోవడంతో గ్రామస్థుల సహాయంతో తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. చివరకి ఇద్దరిని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని స్థానిక ఎస్పి డిఎస్ భడోరియా తెలిపారు.
Accused throw brother into well, rape on sister
- Advertisement -