తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అవినీతి పరుడని నిరూపిస్తే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తానని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళీ అన్నారు. ఆదివారం పోసాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు కెసిఆర్, కెటిఆర్ లు రెండు కళ్లు. నేను మాట్లాడుతుంది ఒకరిని పొగడటానికో లేక ఇంకొకరిని తిట్టడానికో కాదు. ప్రతిపక్ష పార్టీ ఓ పార్టీని మిత్రపక్షంగా చేసుకొని పనిచేస్తోంది. కెటిఆర్ అవినీతిపరుడు అనే వార్త చూశా. దర్వాప్తుకు ఆదేశించారు కాబట్టి కెటిఆర్ రాజీనామా చేయాలి అనే లాజిక్ ఏంటో అర్థం కాలేదు. అధికార పక్షాన్ని కూల్చి అధికారంలోకి రావాలనుకునేవారు అలాగే మాట్లాడుతారు.
రేవంత్ రెడ్డి రూ.50 లక్షలతో పట్టుబడి.. కెటిఆర్ ను రాజీనామా చేయాలని అనడం ఏంటి?. డబ్బులు ఇస్తూ పట్టుబడిన రాజకీయ నాయకుడు ఎవరూ లేరు, రేవంత్ తప్ప. కెటిఆర్ ను విమర్శించే హక్కు రేవంత్ కు లేదు. మంత్రులు కెటిఆర్, హరీష్ రావులు నిజాయితి పరులు. నాగార్జున సాగర్ కట్టినప్పుడు ప్రజలు హర్షించారు. సాగర్ కూడా కమీషన్ల కోసమే అని మాట్లాడితే ఎంత చెత్తగా ఉంటుంది. కాళేశ్వరం కమీషన్ల కోసమే కడితే.. ఆనాడు సాగర్ కూడా కమీషన్ల కోసమే నెహ్రూ కట్టారా?. ప్రతిపక్ష నాయకులు మీడియాలో కాదు.. జనం మధ్య ఉండాలి’ అని పోసాని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు.
Actor Posani Krishnamurali fires on Revanth Reddy