Sunday, April 28, 2024

హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడిన సీనియర్ హీరో రాజశేఖర్ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రి వర్గాలు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయనకు ప్లాస్మా థెర‌పీ చికిత్సను అందిస్తున్నామని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. ప్ర‌త్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల హీరో రాజశేఖర్ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే, రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు, భార్య జీవిత తొందరగానే వైరస్ నుంచి కోలుకున్నా ఆయన మాత్రం ఇంకా కరోనాతో పోరాడుతున్నారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.

Actor Rajasekhar Received Plasma Therapy for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News