Wednesday, May 15, 2024

కొత్త స్టోరీ టెల్లింగ్ కనిపిస్తుంది

- Advertisement -
- Advertisement -

శ్రీవిష్ణు హీరోగా రూపుదిద్దుకున్న చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లుగా హసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “కొత్త స్టోరీ టెల్లింగ్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇందులో నాది దొంగ రోల్. దొంగ అంటే పెద్ద పెద్ద స్కాములు అలాంటివి ఏముండవు. చిన్న దొంగ కొంటె పనులు చేస్తుంటాడు. సినిమా 15 నిమిషాల్లోనే అందరి రోల్స్ వచ్చేస్తాయి. నా పాత్ర హిలేరియస్‌గా ఉంటుంది. చాలా త్వరగా నా రోల్‌కి అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాకు ముందు హసిత్ ఇంకో స్టోరీ చెప్పాడు. కానీ ఈ స్టోరీ నచ్చడంతో ఈ సినిమాను ప్రారంభించాము. వివేక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా చూసి వచ్చాక ఫస్ట్ మాట్లాడుకునేది వివేక్ సాగర్ మ్యూజిక్ గురించే. ప్రస్తుతం ‘అర్జున ఫాల్గుణ’ చిత్రం చేస్తున్నా. ఇందులో ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. ఇంకా చైతూతో ‘భళా తందనాన’ కూడా చేస్తున్నా. వీటితో పాటుగా ఒక పోలీస్ ఆఫీసర్ బయోపిక్ కూడా చేస్తున్నాను”అని అన్నారు.

Actor Sree vishnu Interview about Raja Raja Chora

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News