Friday, April 26, 2024

జెపిసి వేయాల్సిందే

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మోడీ అవలంభిస్తున్న నిరంకుశ విధానాలను నిరసిస్తూ రెండో రోజు పార్లమెంట్, రాజ్యసభను బిఆర్‌ఎస్ ఎంపిలతో పా టు, ఇతర ప్రతిపక్షాల ఎంపిలు బహిష్కరించారు. ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అనంతరం బిఆర్‌ఎస్ ఎంపిలతో పాటు, ఇతర ప్రతిపక్షాల ఎంపిలు అదానీ కుంభకోణాలపై సమగ్ర విచారణకు జెపిసి వేయాలని, గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ ఎంపిలు మాట్లాడుతూ జెపిసి నియమించాలని, కేం ద్ర ప్ర భుత్వం తన మొండి వైఖరిని విడనాడాలని, నిరంకు శ, నియంతృత్వ విధానాలు నశించాలంటూ పెద్ద ఎ త్తున ఎంపిలు నినాదాలు చేశారు. అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టాలని బిఆర్‌ఎస్ ఎంపిలు డిమాండ్ చేశారు. రూల్ 267 కింద రాజ్యసభలో చర్చ చేపట్టాలని రాజ్యసభ లో ఎంపి కేశవరావు డిమాండ్ చేశారు.

అదానీ ఆర్థిక కుంభకోణాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని, దీనికిగాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జెపిసి)ని నియమించాలని కోరుతూ ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించగా, తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన అదానీని కేంద్ర ప్రభుత్వం వెనుకేసుకు రావడాన్ని, జెపిసి వేయకుండా మొండి వైఖరి అవలంభించడాన్ని నిరసించాయి. ఈ నిరసన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోకసభలో బిఆర్‌ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎంపిలు సంతోష్ కుమార్, పి.రాములు,కె.ఆర్.సురేష్ రెడ్డి, బిబి పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, కవిత, మన్నె శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News