Tuesday, May 21, 2024

పాక్ వల్లే అఫ్ఘన్‌కు ఈ పరిస్థితి

- Advertisement -
- Advertisement -

Afghan pop star Ariana Saeed slams Pakistan

 

భారత్ మాత్రమే మాకు నిజమైన స్నేహితుడు
అప్ఘన్ పాప్‌స్టార్ అర్యానా సయీద్

న్యూఢిల్లీ: తమ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకోవడం వెనుక పొరుగు దేశం పాకిస్తాన్ హస్తం ఉందని అఫ్ఘనిస్తాన్ పాప్‌స్టార్ అర్యానా సయీద్ ఆరోపించారు. అఫ్గన్ ప్రభుత్వం తాలిబన్లపై చర్యలకు ఉపక్రమించిన ప్రతిసారీ, పాక్ ఏదో ఒక విధంగా జోక్యం చేసుకునేదన్నారు. భారత్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమని, అఫ్ఘనీయులకు ఎంతో సహాయం చేసిందని ధన్యవాదాలు తెలిపారు. శరణార్థులను అక్కున చేర్చుకున్న భారత్ తమ దేశానికి నిజమైన స్నేహితుడు అని పేర్కొన్నారు. అఫ్ఘనిస్తాన్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన నేపథ్యంలో అర్యానా దేశం విడిచి వెళ్లారు. అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించి అఫ్గనిస్తాన్‌లో శాంతి స్థాపనకై తమ వంతు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు.

పాక్‌లోనే తాలిబన్లు శిక్షణ పొందుతున్నారని, ఎన్నో సాక్ష్యాలను చూసిన తర్వాతే తానిలా మాట్లాడుతున్నానని అన్నారు. ‘భారత్ మాకు మాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటుంది. మా దేశ ప్రజలు ముఖ్యంగా శరణార్థుల పట్ల దయా హృదయం కలిగి ఉండటం గొప్ప విషయం. మా ప్రజలందరి తరఫున నేను ధన్యవాదాలు చెబుతున్నా. పొరుగుదేశాల్లో మాకున్న నిజమైన స్నేహితుడు ఇండియా మాత్రమే. ఇది నిజంగా నిజం” అని అర్యానా ఉద్వేగంగా మాట్లాడారు. కాగా 2015లో తాలిబన్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో గల ఓ స్టేడియంలో పాట పాడటం ద్వారా అర్యానా కట్టుబాట్లను తెంచి ధైర్యసాహసాలు కలిగిన మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News