Tuesday, May 7, 2024

వ్యవసాయం దండగకాదు పండగ: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Agriculture is festival not bad at telangana

 

జయశంకర్ భూపాలపల్లి: వ్యవసాయం దండగకాదు పండగ అని సిఎం కెసిఆర్ నిరూపించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. నియంత్రిత సాగు విధానంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. నియంత్రిత పంటల సాగు వల్ల రైతుకు లాభం జరుగుతుందన్నారు. లాభసాటి పంటలతో మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని రైతులను కోరారు. రైతు బాగుపడాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులంతా ఒకే రకం పంట వేస్తే డిమాండ్ తగ్గి మద్దతు ధర రావడంలేదన్నారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఏఏ పంటలు వేయాలో వ్యవసాయ అధికారులు నివేదిక సిద్ధం చేశారని ఎర్రబెల్లి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్‌పి చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News