- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ కెమెరామెన్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు శ్యామ్.కె.నాయుడిపై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. శ్యామ్.కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ సినీ ఆర్టిస్ట్ సాయి సుధా అనే మహిళ ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్.కె.నాయుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సార్ నగర్ పోలీసులు తెలిపారు. కాగా, శ్యామ్.కె. నాయుడు కూడా సినిమాటోగ్రాఫర్గా చాలా సినిమాలకు పనిచేశాడు.
Complaint Against Cinematographer Shyam K Naidu
- Advertisement -