Saturday, September 21, 2024

వారం పాటు ఇజ్రాయెల్‌కు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్ : హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య సాగుతున్న భీకర పోరులో దక్షిణ ఇజ్రాయెల్‌తోపాటు గాజాలో వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. పదులకొద్ది మిలిటెంట్లను అదుపు లోకి తీసుకున్నట్టు రేర్ అడ్మిరల్ డానియెల్ హగారీ తాజాగా వెల్లడించారు. మరోవైపు వందమంది ఇజ్రాయెల్ పౌరులు , సైనికులను హమాస్ ఉగ్రవాదులు అపహరించినట్టు టెల్ అవీవ్ ఇప్పటికే తెలియజేసింది. మొత్తానికి ఇరువైపులా మరణాల సంఖ్య 600 దాటినట్టు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో భారత్ నుంచి అక్కడికి రాకపోకలు సాగించే విమానాలను వారం పాటు రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

‘ ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్టా … టెల్‌అవీవ్‌కు రాకపోకలు సాగించే ఎయిర్ ఇండియా విమానాలను అక్టోబరు 14 వరకు నిలిపివేస్తున్నాం ’ అని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ తేదీల్లో టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులకు అన్ని విధాలా తోడ్పాటునందిస్తామని పేర్కొంది. శనివారం సైతం టెల్‌అవీవ్‌కు రాకపోకలు సాగించే విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఇదిలా ఉండగా, హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడుల నుంచి తిరిగి తేరుకుని ఇజ్రాయెల్… పాలస్తీనా లోని గాజాపై వైమానిక దాడులకు దిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News