- Advertisement -
హైదరాబాద్: టాలీవుడ్ లో మరో దర్శకుడికి కరోనా వైరస్ సోకింది. తనకు కరోనా వచ్చినట్టు ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా’ అని ట్వీట్ చేశాడు. అయితే ఆయన త్వరగా కోలుకోవాని అభిమానులు కోరుకుంటున్నారు. అటు రాజమౌళి, అతని కుటుంబసభ్యులు బుధవారం కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు టెక్నీషియన్స కరోనా బారిన పడ్డారు. ఈ దర్శకుడు ప్రస్తుతం ప్రస్తుతం మహా సముద్రం అనే సిన్మాకు సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. కోవిడ్-19 ఎఫెక్ట్ తగ్గిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.
త్వరలో వస్తా..
ప్లాస్మా ఇస్తా…— Ajay Bhupathi (@DirAjayBhupathi) August 12, 2020
- Advertisement -