ఆర్ట్వేసిన చిత్రాలను విక్రయించి సేకరించిన డబ్బులు
అభినందించిన సిపి విసి సజ్జనార్
మనతెలంగాణ, హైదరాబాద్ : ఆర్ట్వేసిన చిత్రాలను విక్రయించగా వచ్చిన డబ్బులను ఓ బాలిక ఆపరేషన్ స్మైల్కు విరాళంగా అందజేసింది. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ను సోమవారం కలిసి రూ.87,200 అందజేశారు. నగరంలోని బంజారాహిల్స్కు చెందిన అలేఖ్య వేమూరి(15) నగరంలోని మేరీడియన్ పాఠశాలలో పదకొండో తరగతి చదువుతోంది. తాను వేసిన చిత్రాలను విక్రయించింది. వచ్చిన డబ్బులు రూ.87,200ను పిల్లలను రక్షించేందుకు సైబరాబాద్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ స్మైల్కు విరాళంగా అందజేసింది. తన తల్లిదండ్రులతో కలిసి వచ్చి చెక్కును అందజేసింది. అలేఖ్య ఇచ్చిన డబ్బులను పిల్లల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు షీటీమ్స్ డిసిపి అనసూయ తెలిపారు. పిల్లల కోసం విరాళం ఇచ్చిన అలేఖ్యను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అభినందించారు.