- Advertisement -
హైదరాబాద్: ఐఎఎంసి వెంటనే ప్రతిపాదన చేసిన వెంటనే సిఎం కెసిఆర్ ఆంగీకరించారని సిజెఐ ఎన్వి రమణ తెలిపారు. నానక్రాంగూడలోని ఫొనిక్స్ వికె టవర్స్లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్, సిజెఐ జస్టిస్ ఎన్వి రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిజెఐ మీడియాతో మాట్లాడారు. తక్కువ సమయంలో మంచి వసతులతో ఐఎఎంసి ఏర్పాటైందని కొనియాడారు. మౌళిక వసతులు కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు రమణ తెలిపారు. అన్ని కేసుల్లో ఐఎఎంసి మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తోందని, తక్కువ ఖర్చుతో తక్కువ కాలంతో సమస్యలకు పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు.
- Advertisement -