Wednesday, May 15, 2024

హైదరాబాద్ ను అతిగా ప్రేమించే వ్యక్తి సిజెఐ: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరాన్ని అతిగా ప్రేమించే వ్యక్తి సిజెఐ ఎన్‌వి రమణ అని సిఎం కెసిఆర్ తెలిపారు. నానక్‌రాంగూడలోని ఫొనిక్స్ వికె టవర్స్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్, సిజెఐ జస్టిస్ ఎన్‌వి రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. ఐఎఎంసి ఏర్పాటులో సిజెఐ ఎన్‌వి రమణ కీలక పాత్ర పోషించారని కొనియడారు. హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందుతుందని ఎన్‌ఆర్‌ఐలు అన్నారని, హైదరాబాద్‌ను ప్రమోట్ చేయడంలేదని ఎన్‌ఆర్‌ఐలు చెబుతున్నారని, ఐఎఎంసి కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. భవిష్యత్‌లో హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ కాబోతుందని ప్రశంసించారు. ఐఎఎంసి దేశానికి, తెలంగాణకు మంచి పేరు తీసుకవస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News