- Advertisement -
హన్మకొండ: జిల్లాలోని ఖాజీపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం మండలంలోని తరాలపల్లి క్వారీలో ప్రమాదవశాత్తు టిప్పర్ బోల్తా పడడంతో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
3 Killed in Road Accident in Khajipet
- Advertisement -