Sunday, April 28, 2024

అమలాపురంలో హోంగార్డు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరులో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి హోంగార్డు వెంకట శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకట శ్రీనివాస్ బొమ్మూరులో హోంగార్డుగా పని చేస్తున్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం స్థానిక అమలాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కుటుంబ కలహాలు, విధుల నిర్వహణలో ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయం తెలియాల్సి ఉంది.

Also Read:  మనిషిని పోలిన ఎలుగుబంటి(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News