Monday, April 29, 2024

అమలాపురం నుంచి కోడికత్తి శ్రీను పోటీ?

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి అధినేత, సిఎం జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు (కోడి కత్తి శ్రీను) జైభీమ్ భారత్ పార్టీలో చేరారు. కోడి కత్తి శ్రీనును జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అమలాపురం నియోజకవర్గం నుంచి కోడికత్తి శ్రీను పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2019 ఎన్నికల ముందు విశాఖపట్నంలో జగన్ మోహన్ రెడ్డిపై శ్రీను కోడి కత్తితో దాడి చేసిన సంఘటన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News