Monday, April 29, 2024

రాజేంద్రనగర్ లో కత్తిపోట్ల కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో కత్తి పోట్ల కలకలం సృష్టించాయి. మంగళవారం తెల్లవారుజామున నితీష్ అనే యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. విచక్షణారహితంగా నితీష్ పై కత్తులతో దాడి చేసి దుండగులు పారిపోయారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఎన్ఎం గూడ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. సదరు యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News