Tuesday, April 30, 2024

ఐఓసి అధ్యక్షుడికి అంబానీ దంపతుల ఆతిథ్యం

- Advertisement -
- Advertisement -

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబాని మంగళవారం సాయంత్రం తమ నివాసంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసి) అధ్యక్షుడు థామస్ బీచ్‌కు ఆతిథ్యమిచ్చారు. అక్టోబర్ 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు ఐఓసి 141వ సమావేశాలు ముంబైలో జరగనున్నాయి.

ఈ సందర్భంగా నగరానికి వచ్చిన ఐఓసి అధ్యక్షుడు థామస బీచ్‌కు తమ నివాసంలో అంబానీ దంపతులు విందు ఇచ్చారు. 40 సంవత్సరాల విరామం అనంతరం ఐఓసి సమావేశాలు భారత్‌లో జరగనున్నాయి. చివరిగా 1983లో ఐఓసి సమావేశాలు న్యూఢిల్లీలో జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News