Wednesday, May 1, 2024

కడపలో జీపును ఢీకొట్టిన లారీ: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. కొండాపురం మండలం చిత్రావతి వంతెన వద్ద జీపును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. తిరుమలకు వెళ్లి తాడిపత్రికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు తాడిపత్రి, బళ్లారికి చెందిన వారిగా గుర్తించారు.

Also Read: టీవీలు, ఫోన్ల కోసం జైలు ఖైదీల సమ్మె

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News