- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 1,19,404 మందికి వాక్సిన్ వేశారు. వీరిలో 45,755 మంది మొదటి డోసు 73,649 మంది సెకండ్ డోసు వేసుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 3,03,029 హెల్త్కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా 2,24,711 మంది రెండో డోసు తీసుకున్నారు. అదే విధంగా 3,15,372 మంది ఫ్రంట్లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా 1,98,790 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. 18 నుంచి 44 మధ్యస్కుల్లో 53,52,937 మంది మొదటి, 6,33,765 మంది రెండో డోసు వేసుకున్నారు. దీంతో పాటు 45 ఏళ్లు పై బడిన వారిలో 54,10,361 మంది మొదటి, 25,84,532 మంది రెండో డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,50,23,497 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
- Advertisement -