- Advertisement -
హైదరాబాద్: బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మరో 15 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన సిద్ధార్ధతో పాటు మరో 14మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ కు సంబంధించి నిందితుల దగ్గర సమాచారం సేకరిస్తున్నారు పోలీసులు. భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ రెడ్డి, కిరణ్మయి, చంద్రహాస్ పరారీలోనే ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో ఈ నెల 6న అఖిలప్రియను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
- Advertisement -